
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకలు పట్టణంలో ఆదివారం అంబరాన్ని అంటేలా నిర్వహించారు. వాడ వాడన తెలంగాణ నినాదాలతో వాడలన్ని మారు మొగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గందే రాధిక, కోర్టు సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జీ డివి నాగేశ్వర్రావు, జూనియర్ సివిల్ జడ్జిలు అలెఖ్య, స్వాతి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ రమేష్, ఎంవిఐ కార్యాలయంలో ఎంవిఐ వేణు, ఏసీపి కార్యాలయంలో ఎసిపి శ్రీనివాస్ జి, తాసీల్దార్ కార్యాలయంపై తహసీల్దార్ కే విజయ్ కుమార్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఐసిడిఎస్ ఆఫీసులో సిడిపిఓ భాగ్య, ఏడిఏ కార్యాలయంలో ఏడిఏ సునీత, స్థానిక టౌన్ పోలీస్టేషన్లో టౌన్ సీఐ బొల్లం రమేష్, రూరల్ పోలీస్టేషన్లో సీఐ రమేష్, ప్రభుత్వ ఏరియా దవాఖానలో డాక్టర్ రాజేందర్రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండోలో చైర్మన్ ఎడవెల్లి కొండాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్లో ఇన్చార్జి కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బస్డీపోలో ఇన్చార్జి డీఎం సత్యనారాయణ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో కెవి నరసింహారెడ్డి, ఏఎస్ డబ్ల్యువో కార్యాలయంలో తిరుపతినాయక్ తో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాలలో అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కే కిరణ్ కుమార్ జెండాలను ఆవిష్కరించారు. చౌరస్తాలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన ఏఐసీసీ గౌరవ అధ్యక్షురాలు సోనియాగాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, బల్దియా పాలకవర్గం చౌరస్తాలోని అమర వీరులస్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాలను ఎగురవేసి, కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకుని, స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఎంపీడీవో సునీత, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగెం అయిలయ్య, మున్సిపల్ కమీషనర్ సల్వాది సమ్మయ్య, మేనేజర్ రాజారామ్మోహన్రాయ్, సీనియర్ నాయకులు వడ్లూరి విజయ్కుమార్, గందె శ్రీనివాస్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మక్కాపెళ్లి కుమార్ యాదవ్, పైల్ల వెంకటరెడ్డి, పంజాల శ్రీధర్ గౌడ్, బూసారపు బాబురావు, కన్నెబోయిన శ్రీనివాస్, ఇమ్రాన్, ముక్క రమేష్, తొగరు సదానందం, జి ఉమామహేశ్వర్, బి కుమార్యాదవ్, ముత్యంరాజు, నల్ల సుమన్, దండ విక్రంరెడ్డి, గోవిందుల భాస్కర్, బిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కల్లెపల్లి రమాదేవి, నాయకురాళ్లు మారపల్లి సుశీల, ప్రతాప మంజుల, కృష్ణ, కొండ్ర నరేష్, లక్ష్మణమూర్తి, దవాఖాన ఆర్ఎంవో సుధాకర్రావు, ఎస్సైలు సాంబయ్య, సాజిద్, ఏవో సునిల్ కుమార్, నయాబ్ తహసీల్దార్, డీఏవో సీ సందీప్, కౌన్సిలర్లు, పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.





