మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీస్ లు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో 14 మందిపై కేసు నమోదు చేసి వారిని శుక్రవారం హుజురాబాద్ కోర్టులో హాజరు పరిచారు. 14 మందిని కోర్టులో హాజరు పరుచగా ఇందులో 13 మందికి రూ.9500 హుజురాబాద్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయి శ్రీ జరిమానా విధించారు. అలాగే మరొక వ్యక్తి
రాజు కి ఒక రోజు జైలు శిక్షతో పాటు వంద రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చిందని హుజురాబాద్ టౌన్ సీఐ బొల్లం రమేష్ తెలిపారు.