
-తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం, సిఎస్ లకు విజ్ఞప్తి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 21న బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారిలకు విజ్ఞప్తి చేశారు. గురువారం పత్రిక విలేకరుల సమావేశంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ను వెంటనే ఎత్తివేసి కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీలను వెంటనే నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న సప్లమెంటరీ అన్ని రకాల బిల్లులను అన్ని క్లియర్ చేసి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన 317 జీవోపై ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్నా అన్ని రకాల దరఖాస్తులు అన్నిటిని వెంటనే పరిష్కరించాలన్నారు. రెండవ పిఆర్సి మధ్యంతర భృతి ఐదు శాతం నుండి 20% వరకు వెంటనే ఇవ్వాలని, రెండవ పిఆర్ సి 1 7 2023 నుండి 51 శాతం ఫిట్మెంట్ ఆనాటికి ఉన్న 33 శాతం 67 కరువు భత్యముతో మొత్తం కలిపి అందజేయాలన్నారు. కనిష్ట వేతనం 35 వేలుగా గరిష్ట వేతనం రెండు లక్షల 99 వేల వంద రూపాయలు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి జిపిఎస్ విధానాన్ని కొనసాగించాలి అని చెప్పారు. రిటైర్మెంట్ గ్రాండ్ క్యూట్ 16 లక్షల నుండి 24 లక్షల రూపాయలు పెంచాలని, 15 సంవత్సరాల సర్విస్ నిండిన ప్రభుత్వ ఉద్యోగికి వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధముగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగి కానీ పెన్షనర్ కానీ చనిపోతే ఇప్పుడు ఉన్నరూ .30,000 దహన ఖర్చులను 75 వేల రూపాయల వరకు పెంచాలని, కామన్ క్యాటగిరి ఉద్యోగుల వేతనాన్ని గత కొన్ని పిఆర్ సి లలో నెగ్లెట్ చేస్తున్నారు కనుక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ సుప్రీంటెడ్ స్కేల్లను ధరల ఆధారంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను శుక్రవారం జరుగుతున్న తెలంగాణ మంత్రుల క్యాబినెట్ సమావేశంలో చర్చించి ప్రభుత్వ ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారితో పాటు క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
