
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ గురువారం ఎర్రవల్లిలోని కెసిఆర్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తనయుడు సాయిని కెసిఆర్ ఆశీర్వదించారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతను మరింత పెంచాలని అన్నారు. టిఆర్ఎస్ లో యువతకు అధిక ప్రాధాన్య తీయడం జరుగుతుందని సాయిని రాజకీయాల్లోకి ప్రోత్సహించాలని సూచించారు.






