
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: కువైట్లోని సెవెంత్ రింగ్ రోడ్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు
ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్ ముబారక్కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులోని బైపాస్ బ్రిడ్జిని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారని తెలియరాలేదు. కాగా మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
