
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ జూలై13 : హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట– హుజురాబాద్ రూట్ ఉమేష్ చంద్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోతిరెడ్డిపేట రూట్ ఉమేష్ చంద్ర ఆటోయూనియన్ అధ్యక్షుడిగా ఎడ్ల బిక్షపతి, ఉపాధ్యక్షులుగా రాగం శ్యామ్ లను యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎర్ర కుమార్, గౌరవ సలహాదారులుగా ఏ సతీష్, ప్రధాన కార్యదర్శిగా శనిగరం తిరుపతి, కోశాధికారిగా ఎండి అంజద్, మాజీ అధ్యక్షులు బత్తిని రాజు, పొడిశెట్టి రాజకుమార్, చెన్నోజు రమేష్. సభ్యులు ప్రశాంత్, రాకేష్, అర్జున్, శ్రీకాంత్, కుమ్మరి రాజయ్య, రాజు, కండె రాజు, రమేష్, ఉప్పు రాజేందర్, తునికి మధు, మొలుగూరి కొమురయ్య, వెంకటేష్ తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
