
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్(బాలురు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(టిఎస్) హుజూరాబాద్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా టీ.మాధవరావు, ప్రధాన కార్యదర్శిగా కేతిరి భాగ్యరేఖ, అసోసియేట్ అధ్యక్షులుగా అరిగేల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కంకణాల భాస్కర్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షులుగా సహీద సల్మా, కార్యదర్శిగా ఎం మమత, మహిళా కార్యదర్శిగా ఎన్ పద్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా సైదాపూర్ మండల అధ్యక్షుడు గడిపే సహోదర్, ప్రధాన కార్యదర్శి టి రమేష్ వ్యవహరించారు







