
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా హుజురాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్సార్ అందించిన సేవలను ఆయన కొనియాడారు. వైయస్సార్ ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త పాలు పంచుకోవాలని ప్రణవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






