
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక ఫంక్షన్ హాల్లో హుజురాబాద్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను గౌరవ సలహాదారు అయిత రాజేందర్, జిల్లా అధ్యక్షుడు సిరి రవి, ప్రధాన కార్యదర్శి తుమ్మ చందు ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా నాలుగో సారి మాచర్ల రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దూలం చిరంజీవి, ఉపాధ్యక్షులుగా ఎండి యాకూబ్ ఆలీ, ఎడ్ల కుమార్, కోశాధికారిగా కొయ్యడ శ్రీశైలం, సహాయ కార్యదర్శులుగా రమేష్, రాజేష్, ఆర్గనైజర్ సెక్రటరీలుగా బిక్షపతి, అయిత శ్రీధర్, కార్యవర్గ సభ్యులుగా మధుకర్, అశోక్, రమేష్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు సహకరించిన ప్రతి సభ్యుడికి అధ్యక్షుడు మాచర్ల రాజుగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.







