
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రజల కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆచరణీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం 39వ చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంటరోడ్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు ప్రజాసంఘాల నాయకులు, రజక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తి పటిమను అందరూ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తోట రాజేంద్రప్రసాద్, కమిషనర్ సల్వాది సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, రజక సంఘ నాయకులు కొండపాక శ్రీనివాస్, నల్ల సుమన్, కొలిపాక శంకర్, రాజమౌళి, ప్రతాప రాజు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష, సిపిఐ పట్టణ కార్యదర్శి బోడ్డు రాజు మండల నాయకులు గరిగే రాములు, అనుదీప్, సాయి చందు, నిమ్మటూరి సాయికృష్ణ, తాటిపాముల రాము, ఎర్ర శ్రీధర్, ఎర్ర నాగరాజు, ఎర్రపల్లి రమేష్, కుడికాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.








