
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ఆదివారం బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిజెపి అత్యధికంగా కార్యకర్తలు ఉన్న పార్టీ అని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి బూత్ కు 200 సభ్యత్వాలు తగ్గకుండా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రాముల కుమార్ , సభ్యత్వ నమోదు మండల కన్వీనర్ ముప్పు మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, నరసింహ రాజు, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, జెల్ల సుధాకర్, శ్రీరామ్ శ్యామ్, పారుపల్లి కొండల్ రెడ్డి, పంజాల లక్ష్మి, చిదిరాల శ్రీనివాస్, మండల సాయిబాబా, బైరెడ్డి సంపత్ రెడ్డి, పాకాల నారాయణరెడ్డి, నర్రా శ్రీనివాస్ రెడ్డి, బండారు లావణ్య, పంజాల రాజేష్, కొన్ని ప్రవీణ్ రెడ్డి, శక్తి కేంద్రం ఇన్చార్జులు, భూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.








