Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగిన ఏఐఎఫ్టిఓ (అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమైక్య ) జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి పి ఆర్ టియు తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలపై దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో జరిగే చర్చ వేదికల్లో పాల్గొన్నందుకు గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యాయులు అభినందిస్తూ ఆత్మీయంగా సన్మానించినారు. సంఘాలకతీతంగా సమస్యల సాధనకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు గోనె శ్రీనివాస్, నక్క తిరుపతి, హట్కర్ రతన్ సింగ్, తౌటం స్వామి, వంగపల్లి శంకర్, లంగరి గణపతి, తిరుపతి, అల్లం రాజు, రామకృష్ణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






