
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సింగాపూర్ గ్రామ శ్రీ శ్రీనివాస ఆటో యూనియన్ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించి సభ్యుల ఆమోదం మేరకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆటో యూనియన్ అధ్యక్షులుగా రాం భద్రస్వామి ఉపాధ్యక్షులుగా ఎక్కడి కుమార్ క్యాషియర్ బూడిమే మహేష్ ఇజ్జిగిరి రాకేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాం భద్రస్వామి మాట్లాడుతూ, ఆటో కార్మికుల సమస్యల సాధనకు పనిచేస్తామని, అందరం ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు మెట్టు అశోక్, రచమల్ల కొమురయ్య, ఇజ్జిగిరి రోహిత్, ఎలుగురి శ్రీనివాస్, సదానందం, బుర్ర సాయిరాజ్, కుమార్ పాల్గొన్నారు.






