
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజూరాబాద్ బీజేపీ పట్టణ 40వ బూత్ అధ్యక్షుడు కోలే రాజు తల్లి ఇటీవల మృతి చెందగా ఆమె దశ దిన కర్మకు ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు నాయకులు నల్ల సుమన్, నరాల రాజశేఖర్, ఆవుల సదయ్య, ఐత సందీప్ కార్యకర్తలు వెళ్లి పూలు సమర్పించి వారి ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.







