Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : ఈనెల 25న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే బీసీల సమరభేరిని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐలేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు చట్ట సభలలో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏరా బీసీలపై వ్యతిరేక వైఖరిని కేంద్రప్రభుత్వం వీడాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య, రాజారామ్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో హరికృష్ణ, శ్రీనివాస్ యాదవ్, ధర్మేందర్ యాదవ్, సమ్మయ్య యాదవ్, బీసీ మహిళా నాయకులు లక్ష్మీ, లత, తదితరులు పాల్గొన్నారు.






