
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్ణపల్లి ఆయుర్వేద డిస్పెన్సరీలో యోగా శిక్షణ తరగతులు శనివారం ప్రారంభించారు. యోగ శిక్షణ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్లు యోగ శిక్షకురాలు మౌనిక తెలిపారు. పి హెచ్ సి పరిధిలోని ఏఎన్ఎంలు ఆశ వర్కర్లకు యోగపై అవగాహన కల్పించారు. కావున ప్రజలు శిక్షణను వినియోగించు కోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.సరోజన, ఎఫ్ ఎన్ ఓ తదితరులు పాల్గొన్నారు.
