
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఘనంగా రాజ్యాంగ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వార్తలు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని అన్నారు. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఆర్థిక ,రాజకీయ సాంస్కృతిక, అసమానతలు నేటికీ తొలిగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల వెనుక బాటుతనానికి దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులే కారణమన్నారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని తెలిపారు. ఇది 1950 జనవరి నుండి అమల్లోకి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ అవార్డు గ్రహీత మాడుగుల ఓదెలును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు వంతడుపుల బాబు, ఇల్లందుల సమ్మయ్య, రొంటాల బుచ్చన్న, వేల్పుల రత్నం, సందుపట్ల జనార్ధన్, రామ్ రాజేశ్వర్, మొలుగురి ప్రభాకర్, రామగిరి అంకుష్, కట్కూరి రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బి సదానందం, రవి తదితరులు పాల్గొన్నారు.







