
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఏసిపి హుజురాబాద్ శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో పట్టణంలోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి నూతనంగా విధుల్లో చేరిన పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్లందరీకి ఆహ్వానం మరియు అవగాహన కార్యక్రమము మరియు గత కొద్ది రోజులుగా హుజురాబాద్ సబ్ డివిజన్లో పనిచేసి బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్లన్దరికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంను రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి హుజురాబాద్ శ్రీనివాస్ జి వారికి సబ్ డివిజన్ పరిధిలోని విధులను మరియు బాధ్యతలు పై అవగాహన కల్పించారు. అదేవిధంగా బదిలీపై వెళ్తున్న వారందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ లు అందరూ హాజరై పోలీస్ ల సేవలను ప్రజలకు మరింత మెరుగుగా అందివ్వాలననే ఉద్దేశంతో నూతనంగా విధుల్లో చేరిన ఆఫీసర్ల అందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ టౌన్, రూరల్ సిఐలు తిరుమల్ గౌడ్, పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట టౌన్, రూరల్ సీఐలు వి రవి, కిషోర్, ఎస్సైలు తోట తిరుపతి, ఎన్ రాజకుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








