
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాదులో తన నివాసంలో పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందెరాధిక -శ్రీనివాస్ అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని బంజారా హిల్స్ ఏసిపి అనుమతి తోనే ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లారని అన్నారు. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇయ్యడానికి వెళ్తే విధులకు ఆటంకం కలిగించారని సిఐ ఫిర్యాదు చేయడం పోలీసుల విజ్ఞతికే వదిలేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఇంటి సరళిలో 100 మంది పోలీసులు పెట్టి ఇంట్లో చొరబడి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాడుతామని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతూ ప్రజల పక్షాన ఉంటామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ప్రతాప్ తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యంరాజు, మక్కపల్లి కుమారస్వామి, బిఆర్ఎస్వి నాయకులు విడపు అనురాగ్, శివసాయి, గాలి సాయి, అనుదీప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్..