
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాదిగ ఐక్య సంక్షేమ సంఘం (మాస్) మాదిగ జాతి ఐక్యత అభివృద్ధి కోసం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల రెండవ తారీకున మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో రాష్ట్ర వ్యవస్థపక అద్యక్షులు మిద్దెపాక రవిందర్ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రాంతానికి చెందిన సినియర్ దళిత నాయకులైన రాం సారయ్యను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందునా ఈ సమావేశానికి ముఖ్యాతిథిగా హజరైన అప్పికట్ల భరత్ భుషన్ మాజీ రైల్వే అధికారి, అదేవిధంగా ఇమ్మడీ విజయపాల్ రిటైర్డ్ ఓఎన్జిసి ఉద్యోగుల సంఘ మాజీ జాతీయ అధ్యక్షులు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర దళిత నాయకులకు రాం సారయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాం సారయ్య మాట్లాడుతూ సంఘ బలోపేతానికి మరియు మాదిగ జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.
