
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణంలోని ఎక్లేసియా మినిస్ట్రీస్ బేతెస్థ ఫుల్ గాస్పల్ చర్చి హుజురాబాద్ సంఘ కాపరి రెవ.డా.డి.డేవిడ్ రాజు ఆధ్వర్యంలో స్థానిక సాయిరూప గార్డెన్స్ లో బుధవారం సాయంత్రం ఘనంగా క్రిస్ట్మస్ వేడుకలు జరిపారు. దాదాపు 500మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికి కేక్ లు ఇస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం చిన్న, పెద్దలు తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక హాజరై మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం క్రైస్తవం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో నడుచుకొని ఐకమత్యంగా జీవించాలన్నారు. అనంతరం అతిథులను, పాస్టర్లను సంఘ పెద్దలు పూల బొకేలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.













