
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన జమాతే ఉలేమ అసోసియేషన్ అధ్యక్షులు మిర్జా ఇమ్రాన్ బెగ్, మహమ్మద్ షాకీర్ ఆధ్వర్యంలో రంజాన్ దీక్షలు పాటిస్తున్న 100 మంది పేద మహిళ కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహమ్మద్ షాకీర్ మాట్లాడుతూ రంజాన్ ఉపవాసం నెలలో మా జమాతే ఉలేమా ఆధ్వర్యంలో ఈరోజు హుజురాబాద్ సిటీ ఫంక్షన్ హాల్లో ఇంతమంది నిరుపేద ముస్లిం మహిళలకు రేషన్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలో మరియు జమ్మికుంట పట్టణంలో నిరుపేద ముస్లిం మహిళ కుటుంబాలకు వారిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఉన్న ముస్లిం సోదరులు చేస్తున్న సహాయం వలన ఈరోజు 100 మంది మహిళలకు రంజాన్ నెలలో పండుగ ఈదుల్ ఫితర్ జరుపుకోవడానికి వారికి అవసరం ఉన్న నిత్య అవసరాలు, బియ్యం, సేమియా, మంచి నూనె, రెండు రకాల పప్పులు, ఉప్పు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పసుపు, చక్కర అన్ని రకాల నిత్యవసర వస్తువులు అప్పగించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తీసుకోవడానికి వచ్చిన మహిళలు కూడా ఎంతో సంతోషపడుతూ ఒక్కొక్కరు ఒక కిట్టు వారి కుటుంబానికి అందజేసినప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం కనబడ్డదన్నారు. మేము కూడా ఈ రంజాన్ పండుగ మా కుటుంబ సభ్యులు జరుపుకోవడానికి మీరు అందించిన నిత్య అవసరాలు వస్తువులను తీసుకున్న వారందరూ మాకు ఈ సహాయం చేసిన వారి అందరికీ అల్లా చాళ మంచిగా వారి కుటుంబాలను ఉంచాలని వారందరూ ప్రార్థించారు. జమాతే ఉలేమా ప్రతి ఒక్క మంచి కార్యక్రమం గతంలో ఏడు సంవత్సరాల నుండి నిరుపేద వృద్ధులు ముస్లిం మహిళలకు ప్రతినెల ఐదు నుండి 1000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వటం జరిగిందన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి చెందినవారికి మటన్ కూడా సరఫరా చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు రంజాన్ నెలలో ఉపవాసం ఉంటున్న పేద కుటుంబాలకు చెందిన మహిళ ముస్లిం వారికి రేషన్ కిట్లను పంపిణీ చేయడం చాలా సంతోషమని ఇక ముందు కూడా జమాతే ఉలేమా ఈ కార్యక్రమం చేసిన కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులు అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తారని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. హుజురాబాద్, జమ్మికుంట జమాతే ఉలేమ అధ్యక్షులు మిర్జా ఇమ్రాన్ బిగ్ మాట్లాడుతూ మేము మా సంఘము ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమం చేపట్టిన కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏక్ మినార్ మస్జిద్ అధ్యక్షుడు మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్, మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీమ్, మజ్జిదే బషీర్ అధ్యక్షులు షేక్ ఫయాజ్, మున్సిపల్ మాజీ కో ఆప్షన్ నెంబర్ మహమ్మద్ అబ్దుల్ గఫార్, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.



