
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ వ్యాపారవేత్త, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్ రావు – లక్ష్మీ దంపతుల 39వ వివాహ వార్షికోత్సవ వేడుకలు హుజురాబాద్ పట్టణంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని భవాని శంకర దేవాలయంలో, హనుమాన్ దేవాలయంలో దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాకర్స్ నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు కేక్ కట్ చేసి రవీందర్ రావును శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుజురాబాద్ క్లబ్ లో క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు రవీందర్రావుచే కేక్ కట్ చేసి, శాలువాలు కప్పి కేకులు స్వీట్లు తినిపించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సాయంత్రం ఆయన నివాసం వద్ద ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రవీందర్ రావు లక్ష్మీ దంపతులు నిండా నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించి వివాహ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో రవీందర్ రావు అభిమానులు, బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి తదితర పార్టీలకు చెందిన నాయకులు వాకర్ నాయకులు, సభ్యులు, పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పట్టణంలోని భవాని శంకర ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం రవీందర్ రావు- లక్ష్మీ దంపతులను శాలువాళ్ళతో సత్కరిస్తున్న ఆలయ కమిటీ నాయకులు, పూజారులు..


ఆలయంలో వివాహ వేడుకలు జరుపుకుంటున్న రవీందర్రావు- లక్ష్మీ దంపతులు..

