
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో స్థానిక కాకతీయకాలనీలో గల మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ గీతాశాజు తెలిపారు. పాఠశాలకు చెందిన ఖతీజా జర్ఫీన్ కు 588/600 మార్కులను పొంది హుజురాబాద్ పట్టణంలో టాపర్ గా నిలిచారు. అలాగే యం సంజనకు 573/600 మార్కులు పొందగా 550 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు,500 మార్కుల పైన 33 మంది విద్యార్థులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 100% శాతం ఫలితాలు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ఫలితాలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ఆమె అభినందనలు తెలిపారు. కాగా అత్యధిక ఫలితాలు సాధించడం పట్ల అన్న వ్యక్తం చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు.




అంబేద్కర్ చౌరస్తాలో స్వీట్లు పంపిణీ చేసి, పటాకలు కాలుస్తున్న మాంటిసోరి పాఠశాల సిబ్బంది.