Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
33 kv హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మత్తుల కోసం ఈనెల 10వ తేదీ శనివారం రోజున(రేపు) విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని హుజురాబాద్ టౌన్ ట్రాన్స్కో ఏఈ ఏం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మరమ్మత్తుల దృష్ట్యా ఉదయం 08:00 గంటల నుండి 10:00 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేయబడుననీ చెప్పారు. హుజురాబాద్ పట్టణం మొత్తం, బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉన్నందున ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.






