
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం వెన్నంపల్లి గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మండల విద్యాశాఖ అధికారి కే శ్రీనివాస్ రెడ్డి, మండల నోడల్ అధికారి కే రవీంద్రచారి, సెక్టోరియల్ ఆఫీసర్లు ఆంజనేయులు, ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఉచితంగా మధ్యాహ్న భోజనము, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, పాఠశాల ప్రారంభమైన మొదటి రోజున విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు క్రీడలలో ప్రత్యేక శిక్షణ, గణితంలో గణిత ఒలంపియాడ్ కోసం శిక్షణ, ఇంగ్లీష్ టెడ్ హెడ్ కోసం శిక్షణ, సైన్స్ సబ్జెక్టుపై సైన్సు ఒలంపియాడ్ కోసం ప్రత్యేకమైన శిక్షణ పూర్తిగా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు విహారయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, ఫీల్డ్ ట్రిప్స్ లాంటివి, పాఠశాలలో నిరంతరం ఉంటాయన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను వ్యక్తిగతంగా ఉపాధ్యాయుల దత్తత తీసుకొని వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకమైన శిక్షణ ఉంటుందనీ, విద్యార్థులకు విద్య పట్ల ఒత్తిడికి గురి కాకుండా ఉండడం కోసం ప్రముఖుల చేత ప్రత్యేకమైన శిక్షణ, మానసిక ఒత్తిడి తగ్గించడం మోటివేషనల్ క్లాసులు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు యోగ, మెడిటేషన్, కూడా విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించడం కోసం నిర్వహించడం జరుగుతుందనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందం టీ జై గోపాల్ సింగ్, కే సత్యనారాయణరెడ్డి, జి.కుమార్, ఎం సత్య, ఎం జయప్రద, ఎం పద్మ, ఎస్ శ్రీలత, ఆర్ నళిని, సిఆర్. పి బిసా, రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెన్నంపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలలైన కొత్త వెన్నంపల్లి, లసుమన్నపల్లి, ఆరెపల్లి, బూడిదపల్లె, సోమారం, మరియు. ఏక్లాస్పూర్ గ్రామాలలో కూడా బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆర్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



వెన్నంపల్లి గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు..