
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఇటీవల అనారోగ్యంతో హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన బుర్ర కవిత అనారోగ్యంతో మృతిచెందగా ఆమె బాల్య స్నేహితులు ఆమె పిల్లలకు ఆర్థిక సహాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. 1998- 99లో విశ్వప్రగతి స్కూల్ మిత్రులు, కాకతీయ కాలేజ్, శాతవాహన డిగ్రీ కాలేజీలో ఆమెతో చదివిన మిత్రులందరు కలిసి 2 లక్షల రూపాయలు జమచేసి వారి పిల్లల పేరుపై బ్యాంకులో జమచేసి బాండును కూతురు సుప్రీతికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు
క్యాస కళ్యాణ్, టీ శ్రీనివాస్, రాజు, బుర్ర అశోక్, దోమల శ్రీశైలం, పంజాల సత్యం, సబ్బని గోవర్ధన్, కోలిపాక సంజయ్, రాజు, వనిత, స్వప్న, నర్మదా, వెంకటేష్, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

బాల్య స్నేహితురాలి పిల్లలకు ఫిక్స్ డిపాజిట్ బాండ్ అందజేస్తున్న పూర్వ విద్యార్థులు..

——————-++++++++——————–
#పత్రికా ప్రకటనలు (యాడ్స్)#
——————++++++++++—————-
@వార్షికోత్సవ శుభాకాంక్షలు&






