
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం
స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా వృక్షమిత్ర అభ్యాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం SFD స్టేట్ కో కన్వీనర్ రావణవేణి రోహిత్ నేతాజీ మాట్లాడుతూ…జాతీయ వాదసిద్ధాంతం కోసం జాతీయ పునర్నిర్మానంలో వారిని భాగం చేస్తూ కార్యకర్తలకు అండగా తోడుగా ఉంటుందన్నారు. యశ్వంత్ రావు కేల్కర్ జి కి ఐదుగురితో ప్రారంభించిన ఏబీవీపీ ప్రస్తుతం లక్షలాదిమంది కార్యకర్తలు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గోస్కుల అజయ్, కన్వీనర్ పెరుగు అభిలాష్, నగర సంయుక్త కార్యదర్శి వరికొల్లు రాజు, సిటీ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్, గౌతమ్ కిరణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




కళాశాల ఆవరణంలో మొక్కలు నాటుతున్న ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు..
——————++++++++—————–
@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@
——————+++++++———————
&వార్షికోత్సవ శుభాకాంక్షలు&






