
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజరాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా కోతులు, కుక్కలు ప్రజల మీద పడి దాడి చేయడం, కరవటం నిత్య కృత్యంగా మారిందని, ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగి ఇప్పటివరకు హుజురాబాద్ పట్టణంలో కొంతమంది గాయపడటం, పలువురు మరణించడం జరిగిందని ఇప్పటికైనా హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య స్పందించి వాటి భారీ నుండి ప్రజలను కాపాడాలని బిఆర్ఎస్ పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నిత్యం కోతులు ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ స్కూల్ కి వెళ్లే పిల్లల మీద, ఇంటి వద్ద ఉండే మహిళల పైన పడి కరవడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. ఎంతో మంది గాయాల పాలవుతున్నప్పటికీ హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రభావతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
హుజురాబాద్ పట్టణములో ఎవరి ఇండ్ల మీద చూసిన కోతులు కనబడుతున్నాయనీ, ఈ కోతులు ప్రజలపై దాడి చేయడం, ఇళ్లల్లో చొచ్చుకొని వచ్చి ఇంట్లో వండిన ఆహార పదార్థాలు పాడు చేయడం, ఇతర వస్తువులను ఎత్తుకొని పోవటం ఇంట్లో ఉన్న వారు కోతులను వేల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు మీద అవి దాడి చేయడం, రోడ్ల వెంట వెళ్లే వారినీ కరవటం ఎక్కడంటే అక్కడ మీద దాడి చేసి గాయపరచటం ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. గాయపడ్డవారు ప్రైవేట్ హాస్పిటల్ లకు వెళ్ల లేక ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి ఇంజక్షన్లు ఇచ్చుకోవడం ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్, వారి సిబ్బంది దృష్టికి వచ్చినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ఆమె అన్నారు. గతంలో మున్సిపల్ పాలకవర్గం ఉన్నప్పుడు రెండు మూడు సార్లు కోతులను పట్టుకొని వెళ్లి ఇతర ప్రాంతాలలో, అడవిలో విడిచిపెట్టిన సంఘటనలు ఉన్నాయన్నారు. పాలకవర్గం సమయం ముగిసినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి అయినా మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఈ కోతుల, కుక్కల గురించి ఒక్కసారి అయినా చర్యలు చేపట్టిన పాపాన పోలేదన్నారు. అందుకే కరీంనగర్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, హుజురాబాద్ ఆర్డీవో హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ చోరువా తీసుకొని వెంటనే కోతులను పట్టణము నుండి తరిమి వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పట్టణంలోని చాలా వాడాలల్లో అంతర్గత రహదారులు శుభ్రం చేయక చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయని వెంటనే పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి రోడ్లపై చెత్త చేదారాన్ని తొలగించి శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ప్రభావతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.


మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్య వివరిస్తున్న బిఆర్ఎస్ పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి





