Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి – ఇందిరానగర్ కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాల 66 మంది విద్యార్థులకు సోమవారం స్పోర్ట్స్ యూనిఫామ్స్ ను హుజురాబాద్ ఎంఈఓ బి శ్రీనివాస్ పంపిణీ చేశారు. హైదరాబాద్ కు చెందిన శ్రీకర ఫౌండేషన్ బాధ్యులు విదుష సహాయంతో 14 వేల రూపాయల విలువగల స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందించారని ఉపాధ్యాయులు జొన్నల విక్రం బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం వెంకటయ్య, ఉపాధ్యాయులు సరోజ, ప్రదీప్ రెడ్డి, రాజేందర్, భారతి, విద్యార్థులు పాల్గొన్నారు.

———————–++++++—————-
&పత్రికా ప్రకటనలు&
—————–+++++++——————-
#@వార్షికోత్సవ శుభాకాంక్షలు#@






