
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఆల్ ఫోర్స్ జూనియర్స్ పాఠశాలలో శుక్రవారం కిండర్ గార్టెన్ లో రెడ్ డే నీ ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కిండర్ గార్టెన్ పిల్లలతో రెడ్ డే జరుపుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని, చిన్నారులను ఇంత అందంగా తయారుచేసి పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం పాఠశాలకు హాజరైన కిండర్ గార్టెన్ తల్లిదండ్రులకు ఫన్ గేమ్స్ లో భాగంగా టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, బాల్ పికింగ్, డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. అదేవిధంగా చిన్నపిల్లల ర్యాంప్ వాక్ అందరిని అలరించింది. తదనంతరం ఫన్ గేమ్స్ లలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతుల అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


అలరించిన రెడ్ డే చిన్నారుల వేడుకలు..


రెడ్ డే లో పాల్గొన్న చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీఎన్నార్…





