
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా పట్టణమంతా అంధకారం నెలకొంది. ఇవాళ వారసంత (గురువారం)కావటం వల్ల మార్కెట్లో అమ్మకందారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోనీ బుడుగ జంగాల కాలనీ, గణేష్ నగర్, ఇల్లందులవాడ, మామిళ్ళవాడ, గాంధీనగర్, కాకతీయ కాలనీ, ఇందిరా నగర్, కొత్తపల్లి, ముక్కపల్లి, బోర్ణపల్లి, థమక్కపేట, నర్సింగాపూర్ రోడ్లన్నీ జలమయం కావడంతో పలువురి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో పలు దుకాణాలు నీట మునిగాయి. నీట మునిగిన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 4-5 గంటల పాటు కురిసిన వర్షంతో పట్టణ మొత్తం జలమయంగా మారిపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. అధికారులు పాలకులు నిర్లక్ష్యం మూలంగానే లోతట్టు ప్రాంతాలు చిన్నపాటి వర్షాలకు సైతం నీటమునుగుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో పలు దుకాణాలు నీట మునిగాయి..



డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో పలు దుకాణాలు నీట మునిగాయి..

నీటీతో నిండిన హైస్కూల్ గ్రౌండ్….

పారుతున్న చిలుక వాగు…


జలమయమైన ప్రధాన రహదారులు….





