Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన ముప్పు స్వామి అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలిపోయింది. నిన్న రాత్రి కురిసిన వానకు గోడలు పూర్తిగా నానిపోయి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇల్లు కూలిందని ముప్పు స్వామి పేర్కొన్నారు. ఇల్లు వెనుక భాగం మొత్తం కూలిపోయినదనీ, కూలిన మట్టి పిల్లలు ఇంటికి బయట సైడ్ కూలిపోవడం వలన లోపల ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదు అని అన్నారు. ప్రభుత్వం మానవతా దక్పథంతో ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు గ్రామస్తులు కోరుతున్నారు.






