Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి అధికారి ఎన్నికల సంఘం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని హుజురాబాద్ ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీవో తూర్పాటి సునీత అన్నారు . సోమవారం పంచాయతీ రాజ్ ఎన్నికలలో భాగంగా హుజురాబాద్ పట్టణ శివారులోని కేసీ క్యాంపులో గల రైతు వేదికలో హుజురాబాద్ మండలంలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, ప్రెసిండింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమము జరిగింది. ఈ సందర్భంగా టిఓటి టి.మాధవరావు మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఎవరైనా నిబంధనలో ప్రకారమే పని చేయాలనీ అన్నారు. ఎన్నికల అధికారుల విధులు బాధ్యతల గురించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కిరణ్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






