
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ముందస్తు దీపావళి వేడుకలు శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా పలు పాఠశాలలో దీపావళి పండుగ విశిష్టతను పిల్లలకు వివరించడమే కాకుండా పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి దీపాలను వెలిగించి టపాకాయలు కాల్చారు. టపాకాయలు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రమాదాలు జరుగుతాయని పిల్లలకు వివరించారు.

ముందస్తు దీపావళి వేడుకలు రాస్తున్న విద్యార్థులు..





