Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆర్టీసీ ఎండి, విజిలెన్స్ & జాయింట్ డైరెక్టర్ మరియు కరీంనగర్ జోన్ విజిలెన్స్ ఆఫీసర్ ఎం.రవీందర్ లు మరియు డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ ల ఆదేశానుసారం ఈనెల 27 నుండి వచ్చేనెల 2 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ వారోత్సవాలు జరపడం జరుగుతుందనీ నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు హుజురాబాద్ డిపోలో స్టాఫ్ తో విజిలెన్స్ అధికారుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించి వారిచే ప్రతిజ్ఞా చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిపో హెడ్ కానిస్టేబుల్ బి రవీందర్ రెడ్డి, ఇతర సిబ్బంది, ఎస్ టిఐ ఎల్ సారయ్య, గ్యారేజ్ స్టాఫ్ పాల్గొన్నారు.






