
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ శ్రీకాంతచారి వర్ధంతి వేడుకలు బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విశ్వకర్మ మన్మయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకాంతచారి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మనుమయ సంఘ పట్టణ అధ్యక్షులు నందగిరి శ్రీనివాస్, మండలాధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్, సభ్యులు రాంపల్లి బిక్షపతి, వేమునూరు శ్రీనివాస్, చల్లూరి రఘు, బాణాల సత్యనారాయణ, రాంపల్లి శ్రీనివాస్, గుండారపు వీరాచారి, సదానందం, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాంతాచారి అమర్ రహే అని నినదిస్తున్న విశ్వకర్మ మన్మయ సంఘం నాయకులు..

శ్రీకాంతాచారి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న విశ్వకర్మ మన్మయ సంఘం నాయకులు, సభ్యులు..





