Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఇంచార్జి డిప్యూటీ డీఎం ఎచ్ఓ గా డా. శ్రవణ్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం విధులలో చేరారు. ఇంతకుముందు డిప్యూటీ డిఎంహెచ్వో గా ఉన్న డాక్టర్ చందు పిజి సీటు రావడంతో ఖమ్మంలో చేరనుండడంతో రీలువైనట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఆయన స్థానంలో జమ్మికుంట ఆస్పత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రవణ్ ఈ ప్రాంతంలో సీనియర్ వైద్యునిగా ఉండడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించగా నేడు స్వీకరించారు. కాగా ఈ సందర్భంగా హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ నాయకులు కర్ర పాపిరెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, దాసి కుమారస్వామి, బద్ధుల శ్రీధర్, డాక్టర్ రాహుల్, సంగేo శ్రీనివాస్, తిరుపతి తదితరులు పుష్పగుచ్చoలు అందజేసి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

హుజురాబాద్ ఇంచార్జి డిప్యూటీ డీఎం ఎచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రవణ్ కు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ నాయకులు





