
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్
గత15 సంవత్సరాల నుండి హుజురాబాద్ డివిజన్లో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ కోర్సులతో హుజురాబాద్ డివిజన్ స్థాయిలో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి కొత్తగా బీబీఏ (బాచిలర్ అఫ్ బిజినెస్ అడ్మినియట్రేషన్ ) కోర్స్ను ప్రారంభిస్తున్నామని కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ కోర్సులో పాస్ అయినా విద్యార్థులందరు ఈ కోర్సులో చేరడానికి అర్హులు అన్నారు. ఈ కళాశాలలో బీబీఏతో పాటు బీకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ(ఎంపీసీఎస్/ఎంసీసీఎస్/ఎంపీసీ), బీఎస్సీ(బీజడ్సీ) కోర్సులు కలవన్నారు. కనుక విద్యార్థులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని బీబీఏ కోర్సులో అడ్మిషన్స్ పొందవచ్చాన్నారు. ఇతర వివరాలకు కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి సెల్ 9885069146 లో సంప్రదించాలన్నారు.