
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు తెలంగాణలో పలు జిల్లాల్లో నేటి నుంచి రేపటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వర్షాల భారీ నుండి అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయవద్దని అధికారులు సూచించారు.






