
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ములుగు జిల్లా సరిహద్దు దామరతోగు – రంగాపురం మధ్య గురువారం జరిగిన ఎన్ కౌంటర్ కు సిఎం రేవంత్ రెడ్డి, స్థానిక పార్టీ నాయకులే పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యుపి కార్యదర్శి వెంకటేశ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈనెల 29 న బంద్ పాటించాలని పలిపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి దాడులు చేస్తుందన్నారు.






