
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా హుజురాబాద్ మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మునిసిపల్ చైర్మన్ గందె రాధిక భర్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీఎంస్ కాంప్లెక్స్ లో ఫోటో గ్రాఫర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసీ, స్థానికులకు కేకులు స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంగం మండల అధ్యక్షుడు మాచర్ల రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎండీ యాకుబ్ ఆలీ, కోశాధికారి తలకొక్కుల ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజేష్, నాయకులు రమేష్, చిరంజీవి, అయిత శ్రీధర్, రాజేష్, అంజాద్, రసూల్ ఖాన్, నందు, అశోక్ లు పాల్గొన్నారు.
