
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: దిగవంత నేత భారత మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ మండల కేంద్రములో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని బస్ డిపో క్రాస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలదండలేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేత ఆలేటి సుశీల, తోట రాజేంద్రప్రసాద్, విజయ్ కుమార్, మిడిదొడ్డి రాజు, లంకదాసరి లావణ్య, యేముల పుష్పలత, యండి సజ్జు, యండి అఫ్సర్, యండి తౌసిప్, కొలిపాక శంకర్, పానుగంటి కిరణ్ రెడ్డి, సందమల్ల బాబు, సమ్మెట సంపత్, సందమల్ల నరేశ్, టేకుల శ్రావణ్, రత్నాకర్ రెడ్డి, రామక్రిష్ణ, కూమారస్వామి, తిరుపతి, విజేందర్, అయిలయ్య, పోచయ్య, మోరె తిరుపతి, కుంట నర్సింహారెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, గంటా కిరణ్ రెడ్డి, బి.ఆర్ గౌడ్, దుబాసి బాబు, పుల్ల రాధ, బండారి సదానందం, జుపాక సదానందం, ఎర్ర రవిందర్, ఎర్ర నాగరాజు, జుపాక మల్లీశ్వరి, కడారి తిరుమల, నర్సింగ్ సందీప్, సొల్లు సునిత, కరీమా, రియాజ్, బండ నవీన్, విష్ణుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
