
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు సకరించారు. పీసీసీ కుర్చీలో మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కూర్చోబెట్టారు. ఈ స్వీకారోత్సవానికి హాజరైన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులతో పాటు గాంధీ భవన్ కు భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.






