
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా పాలనలో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో యుపిఎస్ లో కిశోర బాలికలకు ఎనీమియా పరీక్షలు మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు బోరగాల మొగిలి, వడ్లూరి శ్రీలేఖ, తూర్పాటి లక్ష్మీ దుర్గ, డాక్టర్ సునీత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విజేందర్ రెడ్డి, ఆశ కార్యకర్తలు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కిషోర్ బాలికలకు ఎనిమీయ పరీక్షలు నిర్వహిస్తుండగా పరిశీలిస్తున్న చైర్పర్సన్ సుహాసిని..






