
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని Rau’s సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో వరద నీళ్లలో పడి చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది. మృతులు తన్య సోని (తెలంగాణ), శ్రేయా యాదవ్ (యూపీ), నవీన్ దల్విన్ (కేరళ)గా అధికారులు గుర్తించారు. సెల్లార్ ప్రాంతంలో ఒక్కసారిగా 10-12 అడుగుల ఎత్తులో వరద నీరు రావడంతో వీరు అందులో చిక్కుకుని చనిపోయారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.






